ఫిబ్రవరి 19న విడుదల కానున్న 'చెక్'
- January 22, 2021
హైదరాబాద్:టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కెరీర్లో 28వ సినిమాగా 'చెక్' రాబోతుంది. ఈమేరకు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 19న 'చెక్' ప్రేక్షకుల ముందుకు రానుందని పోస్టర్ ద్వారా తెలిపింది చిత్రయూనిట్. కాగా గతేడాది హీరో నితిన్ 'భీష్మ' హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. చాలా కాలం తరువాత నితిన్ కి ఈ సినిమా సక్సెస్ ను ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నితిన్ డిఫరెంట్ మూవీగా 'చెక్' చేస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈమద్యే రిలీజ్ అయిన టీజర్ లో.. ఖైదీగా నితిన్ని చూపిస్తూ ఆయనకు చెస్ ఆడే టాలెంట్ ను చూపించారు. ఈ సినిమా టీజర్ బట్టి చుస్తే నితిన్ మరో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు నితిన్. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సినిమాలు ప్రేక్షకునికి దగ్గరగా ఉండడం కలిస్తోందనే చెప్పాలి. ఇక నితిన్, కీర్తి సురేష్ తోను నటించిన ‘రంగ్ దే’ సినిమా కూడా ఈ వేసవిలోనే విడుదల కానుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







