ఓడలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లలో వినోదాలపై నిషేధం విధించిన దుబాయ్
- January 22, 2021కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఎప్పటికప్పుడు అవసరమై నిర్ణయాలు తీసుకుంటున్న దుబాయ్ పాలన యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓడలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లలో విందులు, వినోదాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దుబాయ్ మారిటైమ్ సిటీ అథారిటీ తమ అధికారిక ట్విటర్ ఖతాలో ఉత్తర్వులు వెలువరించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు నిషేధం అమలులో ఉంటుందని వెల్లడించింది. వినోదాల, వేడుకలలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలు జరిగే అవకాశాలు ఉన్నాయని, జనం భౌతిక దూరం పాటించేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంసీఏ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అందుకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు