ఓడలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లలో వినోదాలపై నిషేధం విధించిన దుబాయ్
- January 22, 2021కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఎప్పటికప్పుడు అవసరమై నిర్ణయాలు తీసుకుంటున్న దుబాయ్ పాలన యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓడలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లలో విందులు, వినోదాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దుబాయ్ మారిటైమ్ సిటీ అథారిటీ తమ అధికారిక ట్విటర్ ఖతాలో ఉత్తర్వులు వెలువరించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు నిషేధం అమలులో ఉంటుందని వెల్లడించింది. వినోదాల, వేడుకలలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలు జరిగే అవకాశాలు ఉన్నాయని, జనం భౌతిక దూరం పాటించేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంసీఏ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అందుకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించింది.
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్