ఓడలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లలో వినోదాలపై నిషేధం విధించిన దుబాయ్
- January 22, 2021కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఎప్పటికప్పుడు అవసరమై నిర్ణయాలు తీసుకుంటున్న దుబాయ్ పాలన యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓడలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లలో విందులు, వినోదాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దుబాయ్ మారిటైమ్ సిటీ అథారిటీ తమ అధికారిక ట్విటర్ ఖతాలో ఉత్తర్వులు వెలువరించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు నిషేధం అమలులో ఉంటుందని వెల్లడించింది. వినోదాల, వేడుకలలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలు జరిగే అవకాశాలు ఉన్నాయని, జనం భౌతిక దూరం పాటించేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంసీఏ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అందుకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ
- విదేశీ బ్యాంకుల పై 20% కొత్త పన్ను.. కస్టమర్లు ఎక్కువ చెల్లించాలా?
- సౌదీకి 'A/A-1' క్రెడిట్ రేటింగ్.. ఎస్ అండ్ పీ
- 2.6 శాతం పెరిగిన కువైట్ జనాభా
- బహ్రెయిన్లో ప్రైవేట్ యూనివర్సిటీ పై స్టూడెంట్ దావా
- ఒమానీ ఫలాజ్ వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రాజెక్ట్లు..యునెస్కో
- ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
- దుబాయ్ కొత్త లోగోను ఆవిష్కరించిన క్రౌన్ ప్రిన్స్
- ప్రతి మహిళ శక్తి రూపంలో కన్పిస్తుంది: ప్రధాని మోడీ