ఓడలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లలో వినోదాలపై నిషేధం విధించిన దుబాయ్
- January 22, 2021
కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఎప్పటికప్పుడు అవసరమై నిర్ణయాలు తీసుకుంటున్న దుబాయ్ పాలన యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓడలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లలో విందులు, వినోదాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దుబాయ్ మారిటైమ్ సిటీ అథారిటీ తమ అధికారిక ట్విటర్ ఖతాలో ఉత్తర్వులు వెలువరించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు నిషేధం అమలులో ఉంటుందని వెల్లడించింది. వినోదాల, వేడుకలలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలు జరిగే అవకాశాలు ఉన్నాయని, జనం భౌతిక దూరం పాటించేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంసీఏ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అందుకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







