డొనాల్డ్ ట్రంప్ను హెచ్చరించిన ఇరాన్ అధినేత
- January 23, 2021టెహ్రాన్:అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చీఫ్ ఆయుతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. 2020లో జరిగిన డ్రోన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికను రాశారు. గత ఏడాది జనవరిలో బాగ్దాద్లో జరిగిన అమెరికన్ డ్రోన్ దాడిలో రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసీం సులేమాని మరణించారు. ఆయన అయతొల్లా అలీ ఖమేనికి కుడి భుజం లాంటి వ్యక్తి. ఆయన హత్యకు ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటామనే హెచ్చరికలు చాలాకాలం నుంచి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఖమేనీ అధికారిక ట్విటర్ ఖాతాలో ట్రంప్ను హెచ్చరిస్తూ ఓ ట్వీట్ను పోస్టు చేశారు. సులేమాని హంతకుడు, అందుకు ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి తప్పనిసరిగా ప్రతిహింసను ఎదుర్కొక తప్పదని, తమ నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఏ క్షణంలోనైనా ప్రతిహింస జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
కాగా, గత ఏడాది జనవరి నెలలో ఇరాన్ టాప్ కమాండర్ సులేమాని హత్య జరిగింది. ఈ నెలతో ఏడాది పూర్తయినందున జ్యుడిషియరీ చీఫ్ ఎబ్రహీంరైసీ కూడా ట్రంప్ను హెచ్చరించారు. సులేమాని హంతకులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండలేరని హెచ్చరించడం సంచలనంగా మారింది.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA