ప్రపంచంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం
- January 24, 2021ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు రోజు రోజుకీ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.. మరోవైపు మరణ మృదంగం మోగిస్తోంది. మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే పోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 21 లక్షలను దాటాయి. ఈ వైరస్ ఉధృతిని నివారించడంలో వ్యాప్తిని అరికట్టడంలో మరణాలకు అడ్డుకట్ట వేయడంలో అగ్రదేశాలు సైతం చేతులు ఎత్తేశాయి. బ్రిటన్, జర్మనీ, హాంకాంగ్లోని కోలూన్ ప్రాంతంలో లాక్డౌన్ విధించింది.
భారత్ సహా అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. అయినప్పటికీ- కరోనా తీవ్రత ఎప్పట్లాగే కొనసాగుతోంది. ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 21,30,647 మంది చనిపోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య పది కోట్లకు చేరువ అవుతోంది. ఇప్పటిదాకా 9,93,38,910కేసులు నమోదు అయ్యాయి.అమెరికాలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజు రోజుకీ భారీ సంఖ్యలో పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతుంది. మరోవైపు మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.
ఓ వైపు కరోనా వైరస్ కంగారు పెడుతుంటే.. మరో వైపు స్ట్రెయిన్ భయబ్రాంతులకు గురించేస్తుంది. ఇప్పటికే పలు దేశాలలో గుర్తించారు వైరాలజీ నిపుణులు. కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్.. ఎప్పటికప్పుడు పరివర్తన చెందుతుండగా.. ఇది ఇతర వైరస్ల కంటే ఎక్కువ సులభంగా వ్యాపిస్తుందని అంటున్నారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం