పవన్ కళ్యాణ్-రానా మూవీ షూటింగ్ ప్రారంభం
- January 25, 2021హైదరాబాద్:మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండటంతో పాటుగా, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ నేడు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. ఈ భారీ సెట్ లోనే సినిమా దాదాపుగా నెల రోజులు పాటు షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ఇక ఈ సినిమాకు హీరోయిన్లుగా చాలా మంది పేర్లు వినిపిస్తున్న ఇంతవరకు చిత్రయూనిట్ అధికారికంగా ఎవరి పేర్లను అనౌన్స్ చేయలేదు. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి తెలుగులో ‘బిల్లా-రంగా’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్