సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే జైలు,10 లక్షల దిర్హాముల జరిమానా
- January 26, 2021
దుబాయ్:సోషల్ మీడియా వినియోగదారులు..ఏదైనా పోస్టులు పెట్టే ముందు..ఇతర పోస్టులను షేర్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.లేదంటే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష ఎదుర్కొక తప్పదు.అంటే జస్ట్ ఒక్క తప్పుడు పోస్టుతో కోరి కష్టాలను కొని తెచ్చుకోవడమే అనమాట. పౌరులు, ప్రవాసీయులను ఉద్దేశించి దుబాయ్ పోలీసులు చేసిన హెచ్చరిక ఇది. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి గతంలో కూడా హెచ్చరించిన దుబాయ్ పోలీసులు..ఇప్పుడు మరోసారి పునరుద్ఘాటించారు.ఎవరైనా ఎదుటి వారిని, ఇతర మత విశ్వాసాలను కించపరిచేలా పోస్టులు పెట్టినా, నేరాలను, హింసను ప్రేరేపించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేసినా ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు 2,50,000 దిర్హామ్ ల నుంచి 10 లక్షల దిర్హామ్ వరకు జరిమానా ఉంటుందని హెచ్చిరించారు.ముఖ్యంగా కొన్ని పోస్టింగ్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఇస్లాం మతాన్ని, మత విశ్వాసాలను కించపరిచేలా పోస్టు పెట్టడం.ఇస్లాం మతమే కాదు..ఇతర ఏ మతాలు సూచించిన ఆచారాలు, విశ్వాసాలను కించపరచొద్దు.పాపాలను, నేరాలను ప్రొత్సహించేలా, ప్రేరేపించేలా పోస్టులు ఉండకూడదు.కింగ్డమ్ లో ఉంటున్న అన్ని వర్గాలు, మతాల విశ్వాసాలను గౌరవించటం, సహనశీలతతో ఉండటంతో యూఏఈ లక్షణమని వివరించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







