సౌదీ: ఐదుగురికి మించి కార్మికులు గుమికూడితే సంస్థ క్లోజ్...
- January 27, 2021రియాద్:కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించింది సౌదీ అరేబియా ప్రభుత్వం. కార్మికులు తాము పని చేసే చోట గుమికూడకుండా, సమావేశం అవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలదేనని అంతర్గత మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఒక వేళ నిబంధన పరిమితికి మించి ఐదుగురి కంటే ఎక్కువ మంది కార్మికులు ఒకే చోట గుమికూడితే సంస్థ ఇన్ ఛార్జ్ కి 50 వేల రియాల్స్ జరిమానా విధిస్తామని, అలాగే సమావేశానికి కారణమైన వ్యక్తికి 5 వేల రియాల్స్ ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఒకవేళ రెండోసారి కూడా నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో సమావేశం అయితే..సంస్థ ఇన్ ఛార్జ్ కి లక్ష రియాల్స్, సమావేశానికి కారణమైన వ్యక్తి 10 వేల రియాల్స్ జరిమానా విధిస్తామని వెల్లడించింది. మూడోసారి కూడా నిబంధన ఉల్లంఘిస్తే ఇన్ ఛార్జ్ తో పాటు సమావేశమైన కార్మికులు అందరిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేసింది. ఒకవైళ్ల నిబంధనల ఉల్లంఘన ప్రైవేట్ సంస్థలో జరిగితే..మూడు నెలల పాటు సంస్థను మూసివేస్తామని, అయినా..మళ్లీ రూల్స్ బ్రేక్ చేస్తే ఆరు నెలల పాటు సంస్థను మూసివేస్తామని అంతర్గత మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు