తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన PRC నివేదిక విడుదల
- January 27, 2021
హైదరాబాద్:తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ నివేదిక విడుదలైంది. తొలుత ఉద్యోగ సంఘాలకే నివేదిక ఇవ్వాలని భావించినా.. ఆయా సంఘాల నేతల వినతితో 275 పేజీల నివేదికను వెబ్ సైట్ లో ప్రభుత్వం పెట్టింది. 7.5శాతం ఫిట్మెంట్ను బిశ్వాల్ కమిటీ సిఫార్సు చేసింది. మరోవైపు పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని కూడా రికమెండ్ చేసింది. ఇటు నివేదికపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ నేటి నుంచి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. తొలిరోజు టీఎన్జీవో, టీజీవో సంఘాలకు త్రిసభ్యకమిటీ ఆహ్వానం పంపింది. సాయంత్రం ఐదు గంటల నుంచి హైదరాబాద్ లోని బీఆర్కే భవన్లో చర్చలు జరుగుతాయి. రెండు సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ చర్చల్లో పాల్గొంటారు. గురువారం నుంచి రెండు లేదా నాలుగు సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించనుంది. ఉద్యోగ సంఘాలతో చర్చలను పురస్కరించుకొని త్రిసభ్య కమిటీ విడిగా సమావేశం కానుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







