ప్రైవేట్ ల్యాబ్ లో పీసీఆర్ టెస్ట్ ఖరీదు 30 దినార్లు..కువైట్ ఆదేశాలు

- January 27, 2021 , by Maagulf
ప్రైవేట్ ల్యాబ్ లో పీసీఆర్ టెస్ట్ ఖరీదు 30 దినార్లు..కువైట్ ఆదేశాలు

కువైట్ సిటీ:దేశంలో పీసీఆర్ టెస్ట్ చార్జీ 30 దినార్లకు మించకూడదని కువైట్ ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రవైట్ ల్యాబులు, ప్రవైట్ సంస్థలకు హెల్త్ లైసెన్స్ డిపార్ట్మెంట్ ఈ మేరకు ఉత్తర్వులు పంపించింది. కోవిడ్ నిర్ధారణ పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ 30 దినార్ల కంటే ఎక్కువ ఛార్జ్ చేయకూదని స్పష్టం చేసింది. ఎవరైన ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రవైట్ ల్యాబ్ లు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది. గవర్నమెంట్ స్టాండర్డ్స్ కు తగినట్లుగా ల్యాబరేటరీ ఉన్న ఆస్పత్రులు, ల్యాబ్ లకు మాత్రమే టెస్టులకు అనుమతి ఇచ్చినట్లు హెల్త్ లైసెన్స్ డిపార్ట్మెంట్ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com