దుబాయ్:ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు..
- January 27, 2021
దుబాయ్:ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు దుబాయ్ మానవ వనరుల శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక నుంచి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కోవిడ్ 19 పేషెంట్ తో నేరుగా కాంటాక్ట్ అయితే..అతను వెంటనే సంబంధిత ఉన్నతాధికారికి సమాచారం అందించింది పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే..ఆ పది రోజుల పాటు ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా వెసులుబాటు కల్పిస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరకపోతే అత్యవసర సెలవులుగా పరిగణిస్తామని వెల్లడించింది. అయితే..రెండోసారి కూడా క్వారంటైన్ లో ఉండాల్సి వస్తే వార్షిక సెలవుల నుంచి కోత విధిస్తామని, ఒకవేళ వార్షిక సెలువులు బ్యాలెన్స్ లేకుంటే జీతంలో నుంచి పది రోజుల శాలరీ కట్ చేయనున్నట్లు మానవ వనరుల శాఖ వివరించింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దీనిపై ఉద్యోగులకు సంబంధిత ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించింది. అంతేకాదు..కోవిడ్ పేషెంట్ తో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉండి కూడా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచాలని చూస్తే మాత్రం అలాంటి ఉద్యోగులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని దుబాయ్ మానవ వనరుల శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







