సౌదీ: ఐదుగురికి మించి కార్మికులు గుమికూడితే సంస్థ క్లోజ్...
- January 27, 2021
రియాద్:కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించింది సౌదీ అరేబియా ప్రభుత్వం. కార్మికులు తాము పని చేసే చోట గుమికూడకుండా, సమావేశం అవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలదేనని అంతర్గత మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఒక వేళ నిబంధన పరిమితికి మించి ఐదుగురి కంటే ఎక్కువ మంది కార్మికులు ఒకే చోట గుమికూడితే సంస్థ ఇన్ ఛార్జ్ కి 50 వేల రియాల్స్ జరిమానా విధిస్తామని, అలాగే సమావేశానికి కారణమైన వ్యక్తికి 5 వేల రియాల్స్ ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఒకవేళ రెండోసారి కూడా నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో సమావేశం అయితే..సంస్థ ఇన్ ఛార్జ్ కి లక్ష రియాల్స్, సమావేశానికి కారణమైన వ్యక్తి 10 వేల రియాల్స్ జరిమానా విధిస్తామని వెల్లడించింది. మూడోసారి కూడా నిబంధన ఉల్లంఘిస్తే ఇన్ ఛార్జ్ తో పాటు సమావేశమైన కార్మికులు అందరిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేసింది. ఒకవైళ్ల నిబంధనల ఉల్లంఘన ప్రైవేట్ సంస్థలో జరిగితే..మూడు నెలల పాటు సంస్థను మూసివేస్తామని, అయినా..మళ్లీ రూల్స్ బ్రేక్ చేస్తే ఆరు నెలల పాటు సంస్థను మూసివేస్తామని అంతర్గత మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







