సౌదీ: ఐదుగురికి మించి కార్మికులు గుమికూడితే సంస్థ క్లోజ్...
- January 27, 2021రియాద్:కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించింది సౌదీ అరేబియా ప్రభుత్వం. కార్మికులు తాము పని చేసే చోట గుమికూడకుండా, సమావేశం అవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలదేనని అంతర్గత మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఒక వేళ నిబంధన పరిమితికి మించి ఐదుగురి కంటే ఎక్కువ మంది కార్మికులు ఒకే చోట గుమికూడితే సంస్థ ఇన్ ఛార్జ్ కి 50 వేల రియాల్స్ జరిమానా విధిస్తామని, అలాగే సమావేశానికి కారణమైన వ్యక్తికి 5 వేల రియాల్స్ ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఒకవేళ రెండోసారి కూడా నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో సమావేశం అయితే..సంస్థ ఇన్ ఛార్జ్ కి లక్ష రియాల్స్, సమావేశానికి కారణమైన వ్యక్తి 10 వేల రియాల్స్ జరిమానా విధిస్తామని వెల్లడించింది. మూడోసారి కూడా నిబంధన ఉల్లంఘిస్తే ఇన్ ఛార్జ్ తో పాటు సమావేశమైన కార్మికులు అందరిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేసింది. ఒకవైళ్ల నిబంధనల ఉల్లంఘన ప్రైవేట్ సంస్థలో జరిగితే..మూడు నెలల పాటు సంస్థను మూసివేస్తామని, అయినా..మళ్లీ రూల్స్ బ్రేక్ చేస్తే ఆరు నెలల పాటు సంస్థను మూసివేస్తామని అంతర్గత మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA