న్యూస్ట్రెయిన్ తో సమర్ధవంతంగా పోరాడుతున్న కోవాగ్జిన్
- January 27, 2021న్యూ ఢిల్లీ: కరోనా కేసులు దేశంలో తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా స్ట్రెయిన్ కేసులతో దేశం ఆందోళన చెందుతున్నది. పాత కరోనా వైరస్ కంటే కొత్త స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తోంది. ఈ కొత్త స్ట్రెయిన్ వలన బ్రిటన్ లో అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కేసులు, మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రపంచం దీనిపై దృష్టి సారించింది. ఇక ఇదిలా ఉంటే, ఇండియాలో భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ న్యూ స్ట్రెయిన్ వైరస్ పై సమర్ధవంతంగా పోరాటం చేస్తున్నట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది. వైరస్ ను తటస్థీకరించడంతో పాటుగా, మ్యూటేషన్ చెందుతూ వైరస్ తప్పించుకునే ప్రభావాన్ని కూడా తగ్గించడంతో కోవాగ్జిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని, 26 మందిపై జరిపిన ప్రయోగాల ఫలితాలే ఇందుకు నిదర్శనం అని భారత్ బయోటెక్ తెలిపింది. ఇక కోవాగ్జిన్ టీకా సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు ది లాన్సెట్ పత్రిక కూడా పేర్కొన్నది.
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్