కరోనా వచ్చిందా? అయితే ఈ రూల్స్ చదవండి..
- January 27, 2021యూఏఈ: ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు దుబాయ్ మానవ వనరుల శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక నుంచి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కోవిడ్ 19 పేషెంట్ తో నేరుగా కాంటాక్ట్ అయితే..అతను వెంటనే సంబంధిత ఉన్నతాధికారికి సమాచారం అందించింది పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే..ఆ పది రోజుల పాటు ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా వెసులుబాటు కల్పిస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరకపోతే అత్యవసర సెలవులుగా పరిగణిస్తామని వెల్లడించింది. అయితే..రెండోసారి కూడా క్వారంటైన్ లో ఉండాల్సి వస్తే వార్షిక సెలవుల నుంచి కోత విధిస్తామని, ఒకవేళ వార్షిక సెలువులు బ్యాలెన్స్ లేకుంటే జీతంలో నుంచి పది రోజుల శాలరీ కట్ చేయనున్నట్లు మానవ వనరుల శాఖ వివరించింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దీనిపై ఉద్యోగులకు సంబంధిత ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించింది. అంతేకాదు..కోవిడ్ పేషెంట్ తో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉండి కూడా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచాలని చూస్తే మాత్రం అలాంటి ఉద్యోగులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని దుబాయ్ మానవ వనరుల శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు