న్యూస్ట్రెయిన్ తో సమర్ధవంతంగా పోరాడుతున్న కోవాగ్జిన్
- January 27, 2021న్యూ ఢిల్లీ: కరోనా కేసులు దేశంలో తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా స్ట్రెయిన్ కేసులతో దేశం ఆందోళన చెందుతున్నది. పాత కరోనా వైరస్ కంటే కొత్త స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తోంది. ఈ కొత్త స్ట్రెయిన్ వలన బ్రిటన్ లో అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కేసులు, మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రపంచం దీనిపై దృష్టి సారించింది. ఇక ఇదిలా ఉంటే, ఇండియాలో భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ న్యూ స్ట్రెయిన్ వైరస్ పై సమర్ధవంతంగా పోరాటం చేస్తున్నట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది. వైరస్ ను తటస్థీకరించడంతో పాటుగా, మ్యూటేషన్ చెందుతూ వైరస్ తప్పించుకునే ప్రభావాన్ని కూడా తగ్గించడంతో కోవాగ్జిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని, 26 మందిపై జరిపిన ప్రయోగాల ఫలితాలే ఇందుకు నిదర్శనం అని భారత్ బయోటెక్ తెలిపింది. ఇక కోవాగ్జిన్ టీకా సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు ది లాన్సెట్ పత్రిక కూడా పేర్కొన్నది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు