80 ట్రిప్పుల భవన నిర్మాణ వ్యర్ధాలు, రాళ్ల తొలగింపు
- January 27, 2021బహ్రెయిన్: బహ్రెయిన్ లోని హహాలా ప్రాంతంలో 80 ట్రిప్పుల భవన నిర్మాణ వ్యర్ధాలు, రాళ్లను తొలగించినట్లు స్థానిక మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణ వ్యర్ధాలు పేరుకుపోతుండటం పెద్ద సవాలుగా మారటంతో..వ్యర్ధరహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే హమాలా ఉత్తర ప్రాంతంలో భారీగా పేరుకుపోయిన వ్యర్ధాలను, రాళ్లను తొలగించారు మున్సిపాలిటీ అధికారులు. అలాగే బాధ్యతరహితంగా వ్యవహరిస్తూ వ్యర్ధాల డంపింగ్ కోసం నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా పబ్లిక్ ప్రాంతాలు, ఇరుగు పొరుగు నివాస ప్రాంగణాల్లో పడేసిన వారికి అధికారులు ఫైన్ విధించారు. మొత్తం 14 షాపులకు జరిమానా విధించారు. అలాగే ఇరుగు పొరుగు నివాస ప్రాంగణాల్లో వ్యర్ధాలను డంప్ చేసిన వ్యక్తికి 300 దినార్ల ఫైన్ విధించినట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ వ్యర్ధాలు పోగవటం పెద్ద సమస్యగా మారిందని..ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించి భవన వ్యర్ధాలను నిర్దేశించిన డంపింగ్ ప్రాంతంలోనే వేయాలని మున్సిపల్ కౌన్సిల్ కోరింది. దీనిపై ప్రజల్లో అవగహన పెంచేందుకు చర్యలు చేపట్టామని, భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, కార్మికులు కూడా తమకు సహకరించి మున్సిపాలిటీని మరింత సౌందర్యంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని మున్సిపల్ కౌన్సిల్ పేర్కొంది.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?