జైలు అథారిటీస్‌తో భారత వలసదారుల సమస్యల్ని చర్చించిన రాయబారి

- January 28, 2021 , by Maagulf
జైలు అథారిటీస్‌తో భారత వలసదారుల సమస్యల్ని చర్చించిన రాయబారి

కువైట్: కువైట్‌లో భారత రాయబారి అయిన సిబి జార్జి, రిఫార్మ్స్ ఇనిస్టిట్యూషన్స్ అండర్ సెక్రెటరీ మేజర్ జనరల్ తలాల్ మరాఫితో పలు అంవాలపై చర్చించారు. కువైట్లో భారత వలసదారులకు సంబంధించిన పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే జైలు అథారిటీస్ ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. పలువురు ఎంబసీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. శిక్ష ఎదుర్కొంటున్న ఖైదీలను పరస్పరం బదిలీ చేసుకునేలా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సీనియర్ అధికారుల స్థాయిలో పలు సమావేశాలు నిర్వహించేలా ఈ సమావేశంలో నిర్ణయానికి ఇరు వర్గాలూ వచ్చాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com