కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 1500 ఒమన్ రియాల్స్ జరీమానా
- January 29, 2021_1611915247.jpg)
మస్కట్:కోవిడ్ 19 నిబంధనల్ని ఉల్లంఘించేవారికి 1500 ఒమన్ రియాల్స్ వరకూ జరీమానా విధించడం జరుగుతుందని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. వివాహాలు, అంత్యక్రియలు తదితర కార్యక్రమాల కోసం బంధు మిత్రుల్ని పరిమితులకు లోబడి ఆహ్వానించేవారు తప్పక కరోనా నిబంధనల్నఇ పాటించాల్సి వుంటుంది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే 1500 ఒమన్ రియాల్స్ వరకు జరీమానాని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా, కోవిడ్ 19 టెస్ట్కి నిరాకరిస్తే 200 ఒమన్ రియాల్స్ జరీమానా విధిస్తారు. హోం లేదా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఉల్లంఘనకు పాల్పడితే 200 ఒమన్ రియాల్స్ జరీమానా తప్పదు. పబ్లిక్ గేదరింగ్స్, వివాహాలు, అంత్యక్రియల్లో పాల్గొని నిబంధనల్ని ఉల్లంఘిస్తే 100 ఒమన్ రియాల్స్ జరీమానా ఎదుర్కోవాల్సి వుంటుంది. ట్రాకింగ్ బ్రాస్లెట్ని తొలగిస్తే 300 ఒమన్ రియాల్స్ జరీమానా చెల్లించాలి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష