బహ్రెయిన్ ప్రధాని సల్మాన్ కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ
- January 30, 2021
మనామా:కరోనా వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఇండియాతో కలిసి పోరాడిన బహ్రెయిన్ కు భారత ప్రధాని నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ పై పోరాటంలో బహ్రెయిన్ తో భాగస్వామ్యం అయినందుకు భారత్ గర్వపడుతోందని బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాతో అన్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఇరు దేశాల మైత్రి బంధం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు బహ్రెయిన్ కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ను ఎగుమతి చేసిన భారత్ కు సల్మాన్ ధన్యవాదాలు తెలిపారు. భారత్ నుంచి బహ్రెయిన్ కు 10,800 డోసుల వ్యాక్సిన్ గురువారం రోజునే దిగుమతి అయిన విషయం తెలిసిందే. భారత్ తో భాగస్వామ్యాన్ని తాము కానుకగా భావిస్తున్నామని..ఇండియాతో భాగస్వామ్యం ఇరు దేశాలకు లబ్దిదాయకమని అభిప్రాయపడ్డారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







