బహ్రెయిన్ ప్రధాని సల్మాన్ కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ
- January 30, 2021
మనామా:కరోనా వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఇండియాతో కలిసి పోరాడిన బహ్రెయిన్ కు భారత ప్రధాని నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ పై పోరాటంలో బహ్రెయిన్ తో భాగస్వామ్యం అయినందుకు భారత్ గర్వపడుతోందని బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాతో అన్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఇరు దేశాల మైత్రి బంధం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు బహ్రెయిన్ కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ను ఎగుమతి చేసిన భారత్ కు సల్మాన్ ధన్యవాదాలు తెలిపారు. భారత్ నుంచి బహ్రెయిన్ కు 10,800 డోసుల వ్యాక్సిన్ గురువారం రోజునే దిగుమతి అయిన విషయం తెలిసిందే. భారత్ తో భాగస్వామ్యాన్ని తాము కానుకగా భావిస్తున్నామని..ఇండియాతో భాగస్వామ్యం ఇరు దేశాలకు లబ్దిదాయకమని అభిప్రాయపడ్డారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!