బహ్రెయిన్ ప్రధాని సల్మాన్ కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ
- January 30, 2021
మనామా:కరోనా వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఇండియాతో కలిసి పోరాడిన బహ్రెయిన్ కు భారత ప్రధాని నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ పై పోరాటంలో బహ్రెయిన్ తో భాగస్వామ్యం అయినందుకు భారత్ గర్వపడుతోందని బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాతో అన్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఇరు దేశాల మైత్రి బంధం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు బహ్రెయిన్ కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ను ఎగుమతి చేసిన భారత్ కు సల్మాన్ ధన్యవాదాలు తెలిపారు. భారత్ నుంచి బహ్రెయిన్ కు 10,800 డోసుల వ్యాక్సిన్ గురువారం రోజునే దిగుమతి అయిన విషయం తెలిసిందే. భారత్ తో భాగస్వామ్యాన్ని తాము కానుకగా భావిస్తున్నామని..ఇండియాతో భాగస్వామ్యం ఇరు దేశాలకు లబ్దిదాయకమని అభిప్రాయపడ్డారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







