APNRTS వారి సహకారంతో స్వస్ధలం చేరిన మృతదేహం
- January 30, 2021
ఏ.పీ:ఏ.పీలోని తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ నగరానికి చెందిన వాసుపల్లి శ్రీనివాస్ (39) యూఏఈలోని షార్జాలో ప్రమాదవశాత్తు పని చేస్తున్న టాంకర్ నుంచి వెలువడిన విషవాయువులు పీల్చి గత నెల 10వ తేదీన మృతిచెందాడు.అతని మృతదేహాన్ని ఈ రోజు దుబాయ్ నుంచి సామాజిక కార్యకర్త గుండెల్లి నరసింహం సహాయముతో షార్జా నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి చేర్చడం జరిగింది.హైదరాబాద్ నుంచి స్వస్థలం,కాకినాడ వరకు APNRTS వారి సహకారముతో ప్రత్యేక అంబులెన్సు ఏర్పాటు చేసి వారి కుటుంబ సభ్యులకు మృతదేహం చేర్చడం జరిగింది.మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, ఇటువంటి ఆపత్కాలములో విదేశాలలో నివసిస్తున్న వారికి ఈ విధమైన సహాయకార్యక్రమాలు చేస్తున్న ఏ.పీ ముఖ్యమంత్రి వై.స్.జగన్ మోహన్ రెడ్డికి,APNRTS ఛైర్మన్ వెంకట్ మేడపాటి,APNRTS డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ మరియు APNRTS యూఏఈ కో-ఆర్డినేటర్ల,గుండెల్లి నరసింహంకు ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







