టి.హోం మంత్రిని కలిసిన మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్
- January 30, 2021
హైదరాబాద్:భారత దేశవ్యాప్తంగా ముస్లింల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా మారిందని జాతీయ మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్ అతీఫ్ రషీద్ అన్నారు.హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల కోసం ప్రారంభించిన విద్యా, సంక్షేమ పథకాలు నమ్మశక్యం కానివని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారిక పర్యటనలో ఉన్న అతిఫ్ రషీద్ రాష్ట్రంలోని వివిధ విభాగాలను సందర్శిస్తున్నారు.శనివారం నాడు రాష్ట్ర హోంమంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ జాతీయ మైనారిటీ డిప్యూటీ ఛైర్మన్ను తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు.మహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ ఆరు సంవత్సరాల వ్యవధిలో తెలంగాణలోని ముస్లిం మైనారిటీల కోసం సుమారు రూ .4945 కోట్లు ఖర్చు చేశారు.ఇది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఘనత గా అభివర్ణించారు.ఈ సంధర్భంగా అతిఫ్ రషీద్ ప్రజల కోసం కొత్త పథకాలను అమలు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాలని అన్నారు.తెలంగాణలో ముస్లింల సంక్షేమం కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.ముస్లింల కోసం 204 బోర్డింగ్ పాఠశాలలు మరియు 83 జూనియర్ కాలేజీల స్థాపన 90,000 మంది విద్యార్థులతో ఉచిత విద్యతో పాటు, ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట ముస్లింలకు రూ .207 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు.పేద ముస్లిం బాలికల వివాహ సమస్యను పరిష్కరించడానికి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.ఇక్కడి ముస్లింలకు కోచింగ్ సెంటర్లు, మసీదులు, దర్గాలు, అనాథాశ్రమాల పథకాలను ప్రస్తావిస్తూ జాతీయ మైనారిటీ కమిషన్ డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతూ ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా కనిపించడం లేదని అన్నారు.హోంమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూను రెండవ అధికారిక భాషగా చేస్తూ, మొదటిసారిగా 66 మంది ఉర్దూ అధికారులను నియమించారన్నారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ వక్ఫ్ బోర్డు సభ్యుడు హనీఫ్ అలీ కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







