ప్రముఖ డైరెక్టర్ శంకర్కి నాన్ బెయిలబుల్ వారెంట్
- January 31, 2021
చెన్నై:తమిళ అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిన ‘రోబో’ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ సినిమా కథ తనదే అంటూ గతంలోనే ప్రముఖ రైటర్ అరూర్ తమిళనందన్ కోర్టుకెక్కారు. తాను రాసిన ‘జిగుబా’ అనే కథ ఆధారంగా రోబో తెరకెక్కించారని తమిళనందన్ ఆరోపించారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అనేక సార్లు స్పష్టం చేసిన శంకర్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. తదుపరి కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేసింది. రచయిత అరుర్ తమిళ్నందన్ రచించిన ‘జిగుబా’ కథ 1996లో ఓ తమిళ మ్యాగజైన్లో ప్రచురించారు. అదే కథ 2007లో ఓ నవలగా రూపొందింది. కాగా, శంకర్ డైరెక్షన్లో రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ నటించిన ‘రోబో’ సినిమా శంకర్ బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







