ప్రముఖ డైరెక్టర్ శంకర్కి నాన్ బెయిలబుల్ వారెంట్
- January 31, 2021
చెన్నై:తమిళ అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిన ‘రోబో’ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ సినిమా కథ తనదే అంటూ గతంలోనే ప్రముఖ రైటర్ అరూర్ తమిళనందన్ కోర్టుకెక్కారు. తాను రాసిన ‘జిగుబా’ అనే కథ ఆధారంగా రోబో తెరకెక్కించారని తమిళనందన్ ఆరోపించారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అనేక సార్లు స్పష్టం చేసిన శంకర్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. తదుపరి కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేసింది. రచయిత అరుర్ తమిళ్నందన్ రచించిన ‘జిగుబా’ కథ 1996లో ఓ తమిళ మ్యాగజైన్లో ప్రచురించారు. అదే కథ 2007లో ఓ నవలగా రూపొందింది. కాగా, శంకర్ డైరెక్షన్లో రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ నటించిన ‘రోబో’ సినిమా శంకర్ బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







