ప్రముఖ డైరెక్టర్ శంకర్కి నాన్ బెయిలబుల్ వారెంట్
- January 31, 2021
చెన్నై:తమిళ అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిన ‘రోబో’ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ సినిమా కథ తనదే అంటూ గతంలోనే ప్రముఖ రైటర్ అరూర్ తమిళనందన్ కోర్టుకెక్కారు. తాను రాసిన ‘జిగుబా’ అనే కథ ఆధారంగా రోబో తెరకెక్కించారని తమిళనందన్ ఆరోపించారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అనేక సార్లు స్పష్టం చేసిన శంకర్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. తదుపరి కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేసింది. రచయిత అరుర్ తమిళ్నందన్ రచించిన ‘జిగుబా’ కథ 1996లో ఓ తమిళ మ్యాగజైన్లో ప్రచురించారు. అదే కథ 2007లో ఓ నవలగా రూపొందింది. కాగా, శంకర్ డైరెక్షన్లో రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ నటించిన ‘రోబో’ సినిమా శంకర్ బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు