కువైట్ ప్రయాణికులపై ఎయిర్ పోర్ట్ ఫీజు బాదుడు..
- January 31, 2021
కువైట్ సిటీ:కువైట్ విమానాశ్రయం నుంచి రాకపోకలు నిర్వహించే ప్రయాణికులు ఇకపై అదనపు భారం మొయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ పోర్టు ఫీజు ఛార్జీల పేరుతో ప్రతి టికెట్ పై 3 దినార్లను అదనంగా వసూలు చేయనుంది. ఈ మేరకు సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కువైట్ నుంచి ఇతర ప్రాంతాలకు బయల్దేరే ప్రయాణికులకు ప్రతి టికెట్ పై 3 దినార్లు ఎయిర్ పోర్ట్ ఫీజుగా ఛార్జ్ చేయనున్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి కువైట్ కు వచ్చే ప్రయాణికులపై ప్రతి టికెట్ కు రెండు దినార్లు ఛార్జ్ చేయనున్నారు. జూన్ 1 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయి. కువైట్ నుంచి రాకపోకలు నిర్వహించే ప్రవాసీయులతో పాటు కువైట్ పౌరులకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ తమ ఉత్తర్వులో పేర్కొంది. ఎయిర్ పోర్టు ఛార్జీలను ఎయిర్ లైన్స్ లు తమ టికెట్ ధరలోనే యాడ్ చేయనున్నాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







