కువైట్ ప్రయాణికులపై ఎయిర్ పోర్ట్ ఫీజు బాదుడు..
- January 31, 2021
కువైట్ సిటీ:కువైట్ విమానాశ్రయం నుంచి రాకపోకలు నిర్వహించే ప్రయాణికులు ఇకపై అదనపు భారం మొయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ పోర్టు ఫీజు ఛార్జీల పేరుతో ప్రతి టికెట్ పై 3 దినార్లను అదనంగా వసూలు చేయనుంది. ఈ మేరకు సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కువైట్ నుంచి ఇతర ప్రాంతాలకు బయల్దేరే ప్రయాణికులకు ప్రతి టికెట్ పై 3 దినార్లు ఎయిర్ పోర్ట్ ఫీజుగా ఛార్జ్ చేయనున్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి కువైట్ కు వచ్చే ప్రయాణికులపై ప్రతి టికెట్ కు రెండు దినార్లు ఛార్జ్ చేయనున్నారు. జూన్ 1 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయి. కువైట్ నుంచి రాకపోకలు నిర్వహించే ప్రవాసీయులతో పాటు కువైట్ పౌరులకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ తమ ఉత్తర్వులో పేర్కొంది. ఎయిర్ పోర్టు ఛార్జీలను ఎయిర్ లైన్స్ లు తమ టికెట్ ధరలోనే యాడ్ చేయనున్నాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..







