కువైట్ ప్రయాణికులపై ఎయిర్ పోర్ట్ ఫీజు బాదుడు..

- January 31, 2021 , by Maagulf
కువైట్ ప్రయాణికులపై ఎయిర్ పోర్ట్ ఫీజు బాదుడు..

కువైట్ సిటీ:కువైట్ విమానాశ్రయం నుంచి రాకపోకలు నిర్వహించే ప్రయాణికులు ఇకపై అదనపు భారం మొయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ పోర్టు ఫీజు ఛార్జీల పేరుతో ప్రతి టికెట్ పై 3 దినార్లను అదనంగా వసూలు చేయనుంది. ఈ మేరకు సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కువైట్ నుంచి ఇతర ప్రాంతాలకు బయల్దేరే ప్రయాణికులకు ప్రతి టికెట్ పై 3 దినార్లు ఎయిర్ పోర్ట్ ఫీజుగా ఛార్జ్ చేయనున్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి కువైట్ కు వచ్చే ప్రయాణికులపై ప్రతి టికెట్ కు రెండు దినార్లు ఛార్జ్ చేయనున్నారు. జూన్ 1 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయి. కువైట్ నుంచి రాకపోకలు నిర్వహించే ప్రవాసీయులతో పాటు కువైట్ పౌరులకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ తమ ఉత్తర్వులో పేర్కొంది. ఎయిర్ పోర్టు ఛార్జీలను ఎయిర్ లైన్స్ లు తమ టికెట్ ధరలోనే యాడ్ చేయనున్నాయి. 


--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com