ప్రధాని మోదీతో మాట్లాడిన ఇజ్రాయెల్ పీఎం
- February 01, 2021
జెరూసలేం:ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోమవారం ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో తమ దేశ ఎంబసీ వద్ద జరిగిన పేలుడు ఘటన గురించి ప్రస్తావించిన ఆయన.. మా దేశ ప్రతినిధుల రక్షణకు మీ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ధన్యవాదాలని అన్నారు. భారత, ఇజ్రాయెల్ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఇలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో జరిగిన పేలుడుపై జాతీయ దర్యాప్తు సంస్థతో సహా ఢిల్లీ పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ పేలుడుకి అమ్మోనియం నైట్రేట్ వాడినట్టు తేల్చారు. అదే ఆర్డీఎక్స్ వాడి ఉంటె పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని భావిస్తున్నారు. కాగా ఈ ఘటనకు తామే కారణమని జైషే ఉల్ హింద్ సంస్థ ప్రకటించుకుంది. దీనిపై పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







