యూఏఈ:ఉద్యోగులకు జీతం, భాగస్వామ్యులకు గౌరవ వేతనం..
- February 03, 2021
యూఏఈ:ఏదైనా సంస్థ తమ ఉద్యోగులకు జీతాలు పెంచేందుకే ఒకటికి రెండు సార్లు లెక్కలు వేసుకుంటుంది. ఖర్చును తగ్గించుకునేందుకు తర్జనభర్జనలు పడి అవసరం అయితే..ఉద్యోగుల సంఖ్యను కూడా కుదిస్తుంది. ఇక ప్రస్తుత కోవిడ్ సంక్షోభంలో చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులనే బలి చేస్తున్నాయి.
ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ షార్జాలోని ఓ వ్యాపారి తమ ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు.ఉద్యోగులకు వేతనంతో పాటు ఇక నుంచి వారి భాగస్వామికి కూడా సాధారణ వేతనం చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఆయన మన భారతీయ వ్యాపారవేత్త కావటం విశేషం.పేరు డా.సోహన్ రాయ్.తన ఎరిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యులు కోవిడ్ సమయంలోనూ సంస్థ పట్ల చూపించిన చిత్తశుద్ధికి ఫిదా అయ్యారు సోహన్ రాయ్.అందుకే ప్రతి ఉద్యోగి భాగస్వామిని కూడా గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారాయన.దీనికి సంబంధించి ఇప్పటికే తమ ఉద్యోగుల భాగస్వామ్యుల వివరాలను కంపెనీ వర్గాలు సేకరిస్తున్నాయి. ఒక ఉద్యోగి తమ సంస్థలో ఎన్నాళ్లుగా పని చేస్తున్నాడో...ఆ కాలాన్ని పరిగణలోకి తీసుకొని గౌరవ వేతనం ఎంత ఇవ్వాలనేది నిర్ణయించనున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువరించే అవకాశాలు ఉన్నాయి.అయితే..తమ ప్రకటనలో గృహిణులు అని పేర్కొన్న కంపెనీ వర్గాలు..ఒకవేళ ఉద్యోగి భార్య కూడా మరో ఉద్యోగం చేస్తుంటే గౌరవ వేతనం ఇస్తారా..? లేదా? అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







