‘శశి’ సెకండ్ సాంగ్.. ఆకట్టుకుంటున్న అందమైన పాట..
- February 05, 2021హైదరాబాద్:ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శశి’.సురభి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. లవ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. చిత్రాన్ని ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఒకే ఒక లోకం నువ్వు అంటూ సాగే పాట సంచలనం సృష్టిస్తున్న విషయం తేలిసిందే. సంగీత ప్రేమికులను ఈ పాట ఉలలాడిస్తుంది. మిలియల్ వ్యూస్ తో, లైక్స్ తో దూసుకుపోతుంది ఈ పాట. ఇక ఇప్పుడు ఈ సినిమానుంచి సెంకడ్ సాంగ్ ను విడుదలచేసారు. ధీంతానా… ధీంతానా అంటూ సాగే పాటను సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా లాంచ్ చేసారు. అందమైన లిరిక్స్ తో సాగిన ఈపాట ఆకట్టుకుంటుంది. ఇక చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్