బహ్రెయిన్ లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 80 మందికి జైలు శిక్ష
- February 05, 2021
మనామా:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 80 మందికి జైలు శిక్ష విధించింది బహ్రెయిన్ మైనర్ క్రిమినల్ కోర్టు. 80 మందిలో ఉల్లంఘన తీవ్రతను బట్టి 3 నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే 1000 దినార్ల నుంచి 2000 దినార్ల వరకు జరిమానా కూడా విధించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు భౌతిక దూరం పాటించాలని..ఐదుగురికి మించి ఎక్కువమంది ఒకే చోట గుమికూడొద్దని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే..నిబంధనలు పాటించటంలో విఫలమైన వారిపై సంబంధిత అధికారులు కేసులు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు కేసును బదిలీ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం దోషులకు శిక్షలు ఖరారు చేసింది. ఫేస్ మాస్కులు, భౌతిక దూరం నిబంధన ఉల్లంఘనతో పాటు..బ్యూటీ సెలూన్లు, హెయిర్ డ్రెస్సింగ్, రెస్టారెంట్లు, కేఫ్ లు, స్విమ్మింగ్ ఫూల్ కలిగిన రెస్టారెంట్లలోనూ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









