బహ్రెయిన్ లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 80 మందికి జైలు శిక్ష

- February 05, 2021 , by Maagulf
బహ్రెయిన్ లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 80 మందికి జైలు శిక్ష

మనామా:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 80 మందికి జైలు శిక్ష విధించింది బహ్రెయిన్ మైనర్ క్రిమినల్ కోర్టు. 80 మందిలో ఉల్లంఘన తీవ్రతను బట్టి 3 నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే 1000 దినార్ల నుంచి 2000 దినార్ల వరకు జరిమానా కూడా విధించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు భౌతిక దూరం పాటించాలని..ఐదుగురికి మించి ఎక్కువమంది ఒకే చోట గుమికూడొద్దని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే..నిబంధనలు పాటించటంలో విఫలమైన వారిపై సంబంధిత అధికారులు కేసులు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు కేసును బదిలీ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం దోషులకు శిక్షలు ఖరారు చేసింది. ఫేస్ మాస్కులు, భౌతిక దూరం నిబంధన ఉల్లంఘనతో పాటు..బ్యూటీ సెలూన్లు, హెయిర్ డ్రెస్సింగ్, రెస్టారెంట్లు, కేఫ్ లు, స్విమ్మింగ్ ఫూల్ కలిగిన రెస్టారెంట్లలోనూ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com