బహ్రెయిన్ లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 80 మందికి జైలు శిక్ష
- February 05, 2021
మనామా:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 80 మందికి జైలు శిక్ష విధించింది బహ్రెయిన్ మైనర్ క్రిమినల్ కోర్టు. 80 మందిలో ఉల్లంఘన తీవ్రతను బట్టి 3 నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే 1000 దినార్ల నుంచి 2000 దినార్ల వరకు జరిమానా కూడా విధించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు భౌతిక దూరం పాటించాలని..ఐదుగురికి మించి ఎక్కువమంది ఒకే చోట గుమికూడొద్దని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే..నిబంధనలు పాటించటంలో విఫలమైన వారిపై సంబంధిత అధికారులు కేసులు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు కేసును బదిలీ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం దోషులకు శిక్షలు ఖరారు చేసింది. ఫేస్ మాస్కులు, భౌతిక దూరం నిబంధన ఉల్లంఘనతో పాటు..బ్యూటీ సెలూన్లు, హెయిర్ డ్రెస్సింగ్, రెస్టారెంట్లు, కేఫ్ లు, స్విమ్మింగ్ ఫూల్ కలిగిన రెస్టారెంట్లలోనూ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!







