బహ్రెయిన్ లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 80 మందికి జైలు శిక్ష
- February 05, 2021
మనామా:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 80 మందికి జైలు శిక్ష విధించింది బహ్రెయిన్ మైనర్ క్రిమినల్ కోర్టు. 80 మందిలో ఉల్లంఘన తీవ్రతను బట్టి 3 నుంచి 6 నెలల వరకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే 1000 దినార్ల నుంచి 2000 దినార్ల వరకు జరిమానా కూడా విధించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు భౌతిక దూరం పాటించాలని..ఐదుగురికి మించి ఎక్కువమంది ఒకే చోట గుమికూడొద్దని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే..నిబంధనలు పాటించటంలో విఫలమైన వారిపై సంబంధిత అధికారులు కేసులు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు కేసును బదిలీ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం దోషులకు శిక్షలు ఖరారు చేసింది. ఫేస్ మాస్కులు, భౌతిక దూరం నిబంధన ఉల్లంఘనతో పాటు..బ్యూటీ సెలూన్లు, హెయిర్ డ్రెస్సింగ్, రెస్టారెంట్లు, కేఫ్ లు, స్విమ్మింగ్ ఫూల్ కలిగిన రెస్టారెంట్లలోనూ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







