హైదరాబాద్-మాల్దీవులకు గో-ఎయిర్ విమానం...

- February 05, 2021 , by Maagulf
హైదరాబాద్-మాల్దీవులకు గో-ఎయిర్ విమానం...

హైదరాబాద్‌: ఇకపై హైదరాబాద్ నుంచి నేరుగా మాల్దీవులకు విమాన సర్వీసు నడపాలని గోఎయిర్ నిర్ణయించింది.ఈ నెల 11 నుంచి హైదరాబాద్ నుంచి మాల్దీవుల రాజధాని మాలే నగరానికి విమానం నడపనుంది. ఈ రెండు నగరాల మధ్య ఇదే తొలి డైరెక్ట్ విమాన సర్వీసు.ఈ విమాన సర్వీసు వారంలో నాలుగు రోజులు అందుబాటులో ఉంటుంది. సోమవారం, మంగళవారం, గురువారం,ఆదివారం హైదరాబాద్ నుంచి విమాన సర్వీసును తిప్పనున్నారు.

గో-ఎయిర్ ఈ రూట్లో తన ఎయిర్ బస్ ఏ320 నియో విమానాన్ని నడపనుంది.ఉదయం 11.30 గంటలకు హైదరాబాదులో బయల్దేరే ఈ విమానం మాలే కాలమానం ప్రకారం 1.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో స్థానిక కాలమానం ప్రకారం 2.30 గంటలకు మాలేలో బయల్దేరి 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com