బహ్రెయిన్ లో కోవిడ్ ఎఫెక్ట్...ఇండోర్ జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్ క్లోజ్
- February 06, 2021
మనామా:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పలు చర్యలు చేపట్టింది బహ్రెయిన్ ప్రభుత్వం. టాస్క్ ఫోర్స్ సూచనల మేరకు ఈవెంట్లు, వేడుకలు, జిమ్ములు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగుల హజరుపై కొత్తగా మార్గనిర్దేశకాలను జారీ చేసింది. ఫిబ్రవరి 7 నుంచి 21 వరకు ఈ కొత్త మార్గనిర్దేశకాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. కొత్తగా జారీ చేసిన నిబంధనల మేరకు ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేములు, జిమ్ములను తాత్కాలికంగా మూసివేయాలని ప్రకటించింది. ఇండోర్ ఎక్సర్ సైజ్ క్లాసెస్ లపై కూడా నిషేధం విధించింది. అయితే..ఔట్ డోర్ జిమ్ములు, ఎక్సర్ సైజ్ క్లాసులు, క్రీడలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. అయితే..పూర్తి సామర్ధ్యంలో 30 శాతానికి మించకుండా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాగే 30 మంది కంటే ఎక్కువ మంది హజరయ్యే అన్ని రకాల వేడుకలను కూడా తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. చివరికి ఇళ్లలో చేసుకునే ప్రైవేట్ ఫంక్షన్లలో కూడా 30 మందికి మించి ఉండకూడదు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







