బహ్రెయిన్ లో కోవిడ్ ఎఫెక్ట్...ఇండోర్ జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్ క్లోజ్
- February 06, 2021
మనామా:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పలు చర్యలు చేపట్టింది బహ్రెయిన్ ప్రభుత్వం. టాస్క్ ఫోర్స్ సూచనల మేరకు ఈవెంట్లు, వేడుకలు, జిమ్ములు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగుల హజరుపై కొత్తగా మార్గనిర్దేశకాలను జారీ చేసింది. ఫిబ్రవరి 7 నుంచి 21 వరకు ఈ కొత్త మార్గనిర్దేశకాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. కొత్తగా జారీ చేసిన నిబంధనల మేరకు ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేములు, జిమ్ములను తాత్కాలికంగా మూసివేయాలని ప్రకటించింది. ఇండోర్ ఎక్సర్ సైజ్ క్లాసెస్ లపై కూడా నిషేధం విధించింది. అయితే..ఔట్ డోర్ జిమ్ములు, ఎక్సర్ సైజ్ క్లాసులు, క్రీడలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. అయితే..పూర్తి సామర్ధ్యంలో 30 శాతానికి మించకుండా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాగే 30 మంది కంటే ఎక్కువ మంది హజరయ్యే అన్ని రకాల వేడుకలను కూడా తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. చివరికి ఇళ్లలో చేసుకునే ప్రైవేట్ ఫంక్షన్లలో కూడా 30 మందికి మించి ఉండకూడదు.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









