బహ్రెయిన్ లో కోవిడ్ ఎఫెక్ట్...ఇండోర్ జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్ క్లోజ్
- February 06, 2021
మనామా:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పలు చర్యలు చేపట్టింది బహ్రెయిన్ ప్రభుత్వం. టాస్క్ ఫోర్స్ సూచనల మేరకు ఈవెంట్లు, వేడుకలు, జిమ్ములు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగుల హజరుపై కొత్తగా మార్గనిర్దేశకాలను జారీ చేసింది. ఫిబ్రవరి 7 నుంచి 21 వరకు ఈ కొత్త మార్గనిర్దేశకాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. కొత్తగా జారీ చేసిన నిబంధనల మేరకు ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేములు, జిమ్ములను తాత్కాలికంగా మూసివేయాలని ప్రకటించింది. ఇండోర్ ఎక్సర్ సైజ్ క్లాసెస్ లపై కూడా నిషేధం విధించింది. అయితే..ఔట్ డోర్ జిమ్ములు, ఎక్సర్ సైజ్ క్లాసులు, క్రీడలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. అయితే..పూర్తి సామర్ధ్యంలో 30 శాతానికి మించకుండా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాగే 30 మంది కంటే ఎక్కువ మంది హజరయ్యే అన్ని రకాల వేడుకలను కూడా తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. చివరికి ఇళ్లలో చేసుకునే ప్రైవేట్ ఫంక్షన్లలో కూడా 30 మందికి మించి ఉండకూడదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







