వ్యాక్సిన్ తీసుకున్న వారికే ప్రభుత్వ ఆఫీసుల్లోకి అనుమతి..

- February 07, 2021 , by Maagulf
వ్యాక్సిన్ తీసుకున్న వారికే ప్రభుత్వ ఆఫీసుల్లోకి అనుమతి..

రస్ అల్ ఖైమా:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు రస్ అల్ ఖైమా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ సేవల కోసం ప్రభుత్వ ఆఫీసులను సందర్శించే వినియోగదారులు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతి ఉంటుందని ప్రకటించింది. కోవిడ్ కట్టడి కోసం చేపడుతున్న పలు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కనీసం రెండు వారాల ముందు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొన్న వారికి మాత్రమే ప్రభుత్వ ఆఫీసులలోకి అనుమతి ఉంటుందని వెల్లడించింది. సోమవారం నుంచే ఈ నిబంధన అమలులోకి రానుంది. అలాగే పలు సేవల కోసం వెళ్లే వినియోగదారులు అంతా..విధిగా ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు భౌతిక దూరం పాటించాలని...టెంపరేచర్ చెకప్ చేసిన తర్వాతే ఆఫీసులోకి ఎంటర్ అవ్వాలని అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com