కరోనా వ్యాక్సిన్:ప్రపంచంలో భారత్ మూడో స్థానం!
- February 07, 2021
న్యూఢిల్లీ: భారత దేశంలో ఇప్పటివరకూ 57,75,322 మంది ఆరోగ్య, ఫ్రంట్లైన్ కార్మికులకు కరోనా వ్యాక్సిన్ వేశారు.ప్రపంచంలో ఎక్కువమందికి కరోనా వ్యాక్సిన్ వేసిన దేశాల్లో అమెరికా, బ్రిటన్ తరువాత మూడో స్థానంలో భారత్ ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. దేశంలో ఇప్పటిదాకా 53,04,546 మంది వైద్య సిబ్బంది, 4,70,776 మంది ఫ్రంట్లైన్ కార్మికులకు టీకా వేసినట్టు తెలిపింది. అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్లో 6,73,542 మంది, ఆ తర్వాత మహారాష్ట్రలో 4,73,480 మంది, రాజస్థాన్లో 4,59,652 మందికి కరోనా టీకాలు వేసినట్టు తెలిపింది. ఒక్కో రాష్ట్రంలో రెండేసి లక్షల మంది చొప్పున 12 రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు తీసుకున్నట్టు పేర్కొంది. వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచాల్సిందిగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైంది. అప్పుడు తొలి డోసు తీసుకున్న వారు ఈ నెల 13న రెండో డోసు తీసుకోనున్నారు. కరోనా వైరస్ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి అభివఅద్ధి చెందాలంటే 28 రోజుల వ్యవధిలో రెండో డోసు తీసుకోవడం తప్పనిసరి.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







