కరోనా వ్యాక్సిన్:ప్రపంచంలో భారత్ మూడో స్థానం!
- February 07, 2021
న్యూఢిల్లీ: భారత దేశంలో ఇప్పటివరకూ 57,75,322 మంది ఆరోగ్య, ఫ్రంట్లైన్ కార్మికులకు కరోనా వ్యాక్సిన్ వేశారు.ప్రపంచంలో ఎక్కువమందికి కరోనా వ్యాక్సిన్ వేసిన దేశాల్లో అమెరికా, బ్రిటన్ తరువాత మూడో స్థానంలో భారత్ ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. దేశంలో ఇప్పటిదాకా 53,04,546 మంది వైద్య సిబ్బంది, 4,70,776 మంది ఫ్రంట్లైన్ కార్మికులకు టీకా వేసినట్టు తెలిపింది. అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్లో 6,73,542 మంది, ఆ తర్వాత మహారాష్ట్రలో 4,73,480 మంది, రాజస్థాన్లో 4,59,652 మందికి కరోనా టీకాలు వేసినట్టు తెలిపింది. ఒక్కో రాష్ట్రంలో రెండేసి లక్షల మంది చొప్పున 12 రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు తీసుకున్నట్టు పేర్కొంది. వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచాల్సిందిగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైంది. అప్పుడు తొలి డోసు తీసుకున్న వారు ఈ నెల 13న రెండో డోసు తీసుకోనున్నారు. కరోనా వైరస్ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి అభివఅద్ధి చెందాలంటే 28 రోజుల వ్యవధిలో రెండో డోసు తీసుకోవడం తప్పనిసరి.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









