తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

- February 10, 2021 , by Maagulf
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి.నిన్న రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 149 కరోనా కేసులు నమోదు కాగా, ఈరోజు రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం కొత్తగా 157 కరోనా కేసులు నమోదు అయ్యాయి.అటు 163 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,95,988 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇందులో 2,92,578 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,797 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.వీరిలో 729 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక తెలంగాణలో కరోనాతో ఒక్కరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1,613 కి చేరింది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com