రెడ్లిస్ట్ను విడుదల చేసిన బ్రిటన్ వైద్య, ఆరోగ్య శాఖ
- February 10, 2021
లండన్: కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ‘రెడ్ లిస్ట్’లోని దేశాల నుంచి బ్రిటన్లో అడుగుపెట్టే ప్రయాణికులకు నిబంధనలను బ్రిటన్ కఠినతరం చేసింది.ఈ క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 10వేల పౌండ్ల వరకు జరిమానా ఉంటుందని బ్రిటన్ ప్రకటించింది.
అంతేకాదు పదేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించింది.ఈ నిబంధనలు వచ్చే సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని బ్రిటన్ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్ హాన్కాక్ వెల్లడించారు . కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా.. తమ దేశంలోకి వచ్చే ప్రయాణికులకు నూతన క్వారంటైన్ నిబంధనలను నిర్దేశించింది బ్రిటన్ ప్రభుత్వం.
బ్రిటన్కు వచ్చిన ప్రయాణికులు ప్రభుత్వం సూచించిన హోటల్లో 10రోజులు క్వారంటైన్లో ఉండాలని తన ప్రకటనలో పేర్కొన్నారు.సంబంధిత హోటల్ను 1750 పౌండ్స్తో ముందుగానే బుక్ చేసుకోవచ్చన్నారు.రెడ్లిస్ట్లో 33 దేశాలు ఉన్నాయి.వీటిల్లోని ఎక్కువ ప్రాంతాలు దక్షిణాఫ్రికా, యూఏఈ, దక్షిణ అమెరికాలోనే ఉన్నాయి. భారత్ రెడ్ లిస్ట్లో లేదు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









