భారత్ లో కరోనా కేసుల వివరాలు

- February 11, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూఢిలీ:భారత్‌లో కొత్తగా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది.వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 12,923 మందికి కరోనా నిర్ధారణ అయింది.అదే స‌మ‌యంలో 11,764 మంది కోలుకున్నారు.దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,71,294కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 108 మంది కరోనా కారణంగా మృతి చెందారు.దీంతో మృతుల సంఖ్య 1,55,360 కు పెరిగింది.దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,05,73,372 మంది కోలుకున్నారు.1,42,562 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.ఇప్ప‌టివ‌ర‌కు 70,17,114 మందికి వ్యాక్సిన్ వేశారు.కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,40,23,840 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.నిన్న 6,99,185 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com