మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తెలంగాణా యువతి..!

- February 11, 2021 , by Maagulf
మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తెలంగాణా యువతి..!

‘మిస్ ఇండియా 2020’ టైటిల్‌ తెలుగమ్మాయిని వరించింది. బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీలో హైదరాబాద్‌కు చెందిన మానస వారణాసి విజేతగా నిలిచింది. 

2021లో జరగబోయే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస పాల్గొననుంది. ఇక వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్, మిస్ గ్రాండ్ ఇండియా 2020గా హర్యానాకు చెందిన మానికా షియోఖండ్ నిలిచారు.

మిస్ ఇండియా 2019 సుమన్ రావు మానసకు కిరీటాన్ని బహూకరించారు. ఈ పోటీలకు నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పుల్కిత్ సామ్రట్, ప్రముఖ డిజైనర్లు ఫాల్గుని, షేన్ పికాక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com