హోటల్ రూం బుక్ చేసుకుంటేనే దేశంలోకి అనుమతి..
- February 12, 2021
మస్కట్:విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉంటున్న ఒమన్ ప్రభుత్వం..ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా కొత్త సూచనలు చేస్తూ వస్తోంది. ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనను పకడ్బందీగా అమలు చేసేందుకు లేటెస్ట్ మరో ఉత్వర్వులు జారీ చేసింది. ఒమన్ వచ్చే ప్రయాణికులు అందరూ క్వారంటైన్ లో ఉండేందుకు వీలుగా ప్రయాణానికి ముందే హోటల్ లో రూం బుకింగ్ చేసుకోవాలని సూచించింది. వారం పాటు అంటే ఏడు రాత్రులు హోటల్ లో ప్రీ బుకింగ్ చేసుకున్నట్లు ఆధారాలు చూపితేనే టికెట్లను కన్ఫమ్ చేయాలంటూ ఒమన్ కు సర్వీసులను నడిపే ఎయిర్ లైన్స్ సంస్థలను విమాయాన సంస్థ ఆదేశించింది. క్వారంటైన్ లో ఉండేందుకు ఒమన్ లోని ఏ హోటల్ లోనైనా రూం బుక్ చేసుకోవచ్చని..హోటల్ ఎంపిక సునాయసంగా చేసుకునేందుకు అధికారులు అప్ డేట్ చేసిన జాబితాను పరిశీలిస్తే మంచిదని సూచించింది. కొత్త నిబంధన ఫిబ్రవరి 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనల మేరకే విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశామని సీఏఏ వివరించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







