బహ్రెయిన్:కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన 15 మందికి జైలుశిక్ష
- February 12, 2021
మనామా:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు 15 మంది నిందితులపై నేరం రుజువు కావటంతో జైలు శిక్ష విధించింది క్రిమినల్ కోర్టు. వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు బహ్రెయిన్ మంత్రివర్గం పలు ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది. ఒకే చోట ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దనే నిబంధన అందులో ఒకటి. అయితే..కొందరు వ్యక్తులు భౌతిక దూరాన్ని పాటించటంలో అలక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన పోలీసులు..క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఐదుగురి కంటే ఎక్కువ సంఖ్యలో గుమికూడిన 15 మందిని అదుపులోకి తీసుకొని కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించారు. విచారణ చేపట్టిన క్రిమినల్ కోర్టు..నిందితులు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారించి ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష, 1000 దినార్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







