బహ్రెయిన్:కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన 15 మందికి జైలుశిక్ష
- February 12, 2021
మనామా:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు 15 మంది నిందితులపై నేరం రుజువు కావటంతో జైలు శిక్ష విధించింది క్రిమినల్ కోర్టు. వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు బహ్రెయిన్ మంత్రివర్గం పలు ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది. ఒకే చోట ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దనే నిబంధన అందులో ఒకటి. అయితే..కొందరు వ్యక్తులు భౌతిక దూరాన్ని పాటించటంలో అలక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన పోలీసులు..క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఐదుగురి కంటే ఎక్కువ సంఖ్యలో గుమికూడిన 15 మందిని అదుపులోకి తీసుకొని కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించారు. విచారణ చేపట్టిన క్రిమినల్ కోర్టు..నిందితులు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారించి ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష, 1000 దినార్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







