బహ్రెయిన్:కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన 15 మందికి జైలుశిక్ష

- February 12, 2021 , by Maagulf
బహ్రెయిన్:కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన 15 మందికి జైలుశిక్ష

మనామా:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు 15 మంది నిందితులపై నేరం రుజువు కావటంతో జైలు శిక్ష విధించింది క్రిమినల్ కోర్టు. వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు బహ్రెయిన్ మంత్రివర్గం పలు ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది. ఒకే చోట ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దనే నిబంధన అందులో ఒకటి. అయితే..కొందరు వ్యక్తులు భౌతిక దూరాన్ని పాటించటంలో అలక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన పోలీసులు..క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఐదుగురి కంటే ఎక్కువ సంఖ్యలో గుమికూడిన 15 మందిని అదుపులోకి తీసుకొని కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించారు. విచారణ చేపట్టిన క్రిమినల్ కోర్టు..నిందితులు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారించి ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష, 1000 దినార్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com