తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- February 12, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొంచెం పెరిగింది... రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 143 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... ఒక్కరు కరోనాతో మృతిచెందగా... కరోనాబారినపడిన 152 మంది బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నారు. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,277కు చేరుకోగా.. రికవరీ కేసుల సంఖ్య 2,92,848కు పెరిగింది.ఇక, ఇప్పటి వరకు కరోనాబారిన పడి మృతిచెందినవారి సంఖ్య 1614కు చేరింది. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 97.3 శాతంగా ఉంటే..రాష్ట్రంలో 98.84 శాతానికి పెరిగిందని బులెటిన్లో పేర్కొంది సర్కార్..మరోవైపు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,815 యాక్టివ్ కేసులు ఉండగా... అందులో 838 మంది హోం ఐసోలేషన్లోనే ఉన్నారు.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 28,337 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్ల సంఖ్య 82,42,105కు పెరిగిందని చెబుతోంది సర్కార్.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స







