విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్..
- February 12, 2021
న్యూ ఢిల్లీ:విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.ఎందుకంటే భారత కేంద్ర ప్రభుత్వం విమాన ఛార్జీల మోత మోగించింది. దాదాపు 30 శాతం ఛార్జీలు పెంచుతూ సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంధనం ధరలు పెరగడమే దీనికి కారణమంటున్నాయి విమానయాన సంస్థలు.మూడు గంటల నుంచి మూడున్నర గంటల ప్రయాణానికి ఒక్కసారిగా 5 వేల 600 రూపాయల ఛార్జీలు పెరిగాయి.ఇదివరకు 18 వేల 600 ఉన్న ఛార్జీలు... 30 శాతం పెరగడంతో 24 వేల 200లకు చేరాయి. తక్కువ దూరం ప్రయాణించాలనుకునేవారికి మాత్రం కాస్త ఊరట కలగనుంది. ఎందుకంటే కేవలం 10 శాతం ఛార్జీలు మాత్రమే పెంచింది. ఈ ఛార్జీల పెరుగుదల కనీసం 200 రూపాయల నుంచి ఉండనుందని కేంద్ర విమానయాన సంస్థ వెల్లడించింది.ఇక స్వదేశీ విమాన ప్రయాణికులపై కూడా భారం పడనుంది. ఇదివరకు 2 వేలు ఉన్న ఛార్జీలు ఇక 2 వేల 200లకు పెరగనున్నాయి. 6 వేలు ఉన్న ఛార్జీలు 7 వేల 800లకు చేరనున్నాయని కేంద్ర విమానయాన సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







