అరకు ఘాట్ రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం...
- February 12, 2021అరకు:విశాఖపట్నం జిల్లా అరకు ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన టూరిస్ట్ బస్సు... లోయలోకి దూసుకెళ్లింది.. అనంతగిరి మండలం డముకలోని ఐదో నంబర్ మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది.అరకు వెళ్లిన పర్యాటకులు... తిరుగు ప్రయాణం అయిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.ఇది హైదరాబాద్కు చెందిన టూరిస్టుల బస్సుగా చెబుతున్నారు.. స్థానికుల సమాచారంతో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు...
క్షతగాత్రులను 108 సహాయంతో ఎస్.కోట ఆస్పత్రికి తరలిస్తున్నారు.అయితే, ప్రమాద సమయంలో 30 మంది పర్యాటకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. 8 మంది మృతిచెందగా... 20 మందికిపైగా తీవ్రగాయాలపాలైనట్టు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదాన్ని చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. మొత్తంగా మృతులంతా హైదరాబాద్కు చెందినవారిగానే చెబుతున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు