అవినీతి: 48 మంది ప్రభుత్వ అధికారులపై కేసుల నమోదు

- February 13, 2021 , by Maagulf
అవినీతి: 48 మంది ప్రభుత్వ అధికారులపై కేసుల నమోదు

:మొత్తం 48 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేసులు నమోదు చేయబడ్డాయి. డిఫెన్స్, ఇంటీరియర్, జస్టిస్, మున్సిపల్ అలాగే రూరల్ ఎఫైర్స్ మినిస్ట్రీలకు చెందిన ఉద్యోగులపై అవినీతి అభియోగాలు మోపబడినట్లు తెలుస్తోంది.హౌసింగ్, ఎడ్యుకేషన్ మరియు ఎన్విరాన్‌మెంట్, వాటర్ మరియు అగ్రికల్చర్ విభాగాలకు చెందినవారిపైనా అభియోగాలు మోపారు. ఓవర్‌సైట్ మరియు యాంటీ కరప్షన్ అథారిటీ ఈ వివరాల్ని వెల్లడించింది.ప్రెసిడెన్సీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ, సౌదీ ఫుడ్ మరియు డ్రగ్స్ అారిటీ, జనరల్ అథారిటీ ఆఫ్ మిటియరాలజీ మరియు ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ విభాగాల్లోని ఉద్యోగులపైనా అవినీతి ఆరోపణల మేరకు కేసులు నమోదు చేయడం జరిగింది. 17 మంది పౌరులు అలాగే వలసదారులు కూడా అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com