రెండోవిడత ఎక్కువ శాతం పోలింగ్‌ జరిగింది: ఏ.పీ డీజీపీ సవాంగ్‌

- February 13, 2021 , by Maagulf
రెండోవిడత ఎక్కువ శాతం పోలింగ్‌ జరిగింది: ఏ.పీ డీజీపీ సవాంగ్‌

అమరావతి:ఏ.పీ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో తొలివిడత కంటే రెండోవిడత ఎక్కువ శాతం పోలింగ్‌ జరిగిందని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ పేర్కొన్నారు.శనివారం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ..స్థానిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని డీజీపీ తెలిపారు. 2013 పంచాయతీ ఎన్నికల కంటే ఈసారి తక్కువగా అల్లర్లు జరిగిపట్లు చెప్పారు.ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకున్నారన్నారు.

మూడు, నాలుగు విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేయాలని డీజీపీ సవాంగ్‌ తెలిపారు.ఎన్నికలు సమర్థంగా నిర్వహించిన పోలీసులకు డీజీపీ అభినందనలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com