భారత్ లో కరోనా కేసుల వివరాలు

- February 14, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి.తాజాగా కేంద్ర ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 12,194 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,04,940కి చేరింది.ఇందులో 1,06,11,731 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,37,567 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 92 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1,55,642కి చేరింది.ఇక భారత్ లో ఇప్పటి వరకు 82,63,858 మందికి వ్యాక్సిన్ ను అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com