ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం..
- February 14, 2021
ఏ.పీ:ఏ.పీ లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఒక టెంపో లారీని ఢీ కొన్న ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు.నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.ఈ నలుగురిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక మృతులలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని చెబుతున్నారు.అలాగే గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.ప్రమాదం జరిగే సమయానికి టెంపోలో 18 మంది ప్రయాణికులు ఉన్నారని,చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి అజ్మీర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.మృతులంతా మదనపల్లి అంబచెరువు మిట్ట ఎన్టీఆర్ కాలనీకి చెందిన వారు అని తెలుస్తోంది.మృతులలో ఎనిమిది మంది మహిళలు ఉండగా ఐదు మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు అని చెబుతున్నారు.మృతులు జాఫర్, రఫీ, మస్తాన్, అమీర్, టెంపో డ్రైవర్ గా గుర్తించారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







