డి.రామానాయుడు వర్ధంతి సంధర్భంగా ఘన నివాళి
- February 18, 2021
హైదరాబాద్:గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ రామానాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు నిర్మాత సురేష్ బాబు అండ్ పలువురు రామానాయుడు కి ఘన నివాళులు అందించారు.తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి నిర్మాతగా అడుగుబెట్టి దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న అన్ని భాషలలో సినిమాలు నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన నిర్మాత మన రామానాయుడు.అయితే ఫ్రిబ్రవరి 18 న రామానాయుడు వర్ధంతి సందర్భంగా ఫిల్మ్ నగర్ లో రామానాయుడు విగ్రహానికి ఆయన కుమారుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సత్యనారాయణ, సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి ఘనమైన నివాళులు ఘటించారు.
ఈ సంధర్భంగా కాజా సత్య నారాయణ మాట్లాడుతూ "ఈ రోజు ఫిల్మ్ నగర్ ఇలా ఉంది అంటే దానికి ముఖ్య కారణం రామానాయుడు, అయన చేసిన సేవలు వలన ఈరోజు మన ఫిల్మ్ నగర్ ఇంతమందికి జీవన అధారంగా నిలిచింది అని కొనియాడారు.కాబట్టే ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు ప్రతిరోజు స్మరించుకుంటున్నాం.మాకు రామానాయడు జన్మదినాన్ని అలాగే వర్ధంతిని కూడా ఒక పండగలా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్







