కైరా, సారా అలీఖాన్ తో విజయ్ దేవరకొండ జల్సా
- February 21, 2021
యూత్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. కరోనా వలన చిత్ర షూటింగ్కు కొన్నాళ్లు బ్రేక్ పడడంతో స్పీడ్ పెంచారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ 9న మూవీని విడుదల చేయబోతున్నారు.
లైగర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మి ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించిన అప్డేట్స్తో పాటు తమ టీం షూటింగ్ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలియజేస్తూ ఉంటుంది. ఇటీవల బైక్పై విజయ్ దేవరకొండతో బైక్పై షికారుకు వెళుతున్నట్టు తెలియజేసిన ఛార్మి ఇప్పుడు సారా అలీఖాన్, కైరా అధ్వానీ, కరణ్ జోహార్, విజయ్ దేవరకొండ, మనీష్ మల్హోత్రా తో కలిసి దిగిన ఫోటో ఆమె ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో కి నైట్ పార్టీలో తాము ఎంతగానో ఎంజాయ్ చేశామని.. అమేజింగ్ ఫుడ్ తో పాటు అమేజింగ్ పీపుల్ ని కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది.
Manish , thanks a ton for having us over last night.. u r a sweetheart ❤️ wat a fun night ❤️🤗 amazing food , amazing people 🤗@ManishMalhotra @karanjohar @SaraaliKKhan @TheDeverakonda @advani_kiara #purijagannadh #saturdaynight ❤️ pic.twitter.com/sx4BkcoGV4
— Charmme Kaur (@Charmmeofficial) February 21, 2021
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







