యోనో మర్చంట్‌ యాప్‌ లాంచ్ చేస్తున్న SBI

- February 21, 2021 , by Maagulf
యోనో మర్చంట్‌ యాప్‌ లాంచ్ చేస్తున్న SBI

న్యూఢిల్లీ: ఎస్బీఐ పేమెంట్స్‌.. యోనో మర్చంట్‌ యాప్‌ను ప్రారంభిస్తున్నది. వ్యాపారులకు చౌకగా డిజిటల్‌ పేమెంట్స్‌ సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా దీన్ని తెస్తున్నారు. ‘మొబైల్‌ ఆధారిత టెక్నాలజీ ద్వారా దేశంలోని కోట్లాది వ్యాపారులు మరింతగా డిజిటల్‌ పేమెంట్స్‌కు చేరువ కావాలనే లక్ష్యంతో ఓ చౌక డిజిటల్‌ పేమెంట్స్‌ వేదికను సిద్ధం చేస్తున్నాం. వచ్చే రెండేండ్లలో 2 కోట్ల మంది వ్యాపారులు దీన్ని వినియోగించేలా చేయాలని శ్రమిస్తున్నాం. మా యోనో మర్చంట్‌ యాప్‌తో దేశంలో మర్చంట్‌ పేమెంట్స్‌ డిజిటైజేషన్‌ వేగంగా వ్యాపించగలదు’ అని శనివారం ఓ ప్రకటనలో ఎస్బీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com