దృశ్యం-2 కి ఒకే చెప్పేసిన వెంకీ మామ..జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే!
- February 21, 2021దృశ్యం మూవీకి సీక్వెల్గా మలయాళంలో వచ్చిన దృశ్యం 2 హిట్ టాక్తో దూసుకుపోతోంది. జీతూ జోసెఫ్ ఈ సినిమాని ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మోహన్లాల్ నుంచి మరో మాస్టర్ పీస్ వచ్చిదంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లుకురుస్తోంది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే విషయంపై తొలుత అనుమానాలు నెలకొన్నాయి. దృశ్యం సీక్వెల్లో నటించేందుకు విక్టరీ వెంకటేష్ ఆసక్తిగా లేడని ప్రచారం జరిగింది. అయితే అదంతా ఫేక్ అని తేలిపోయింది.
దృశ్యం 2 రీమేక్లో వెంకటేషన్ నటిస్తున్నట్టు దాదాపుగా అధికారికంగా కన్ఫామ్ అయింది. డైరెక్టర్ జీతూ జోసెఫ్, నిర్మాత సురేష్ బాబుతో కలిసి వెంకీ దిగిన ఫొటో ఒకటి బయటపడింది. దీంతో దృశ్యం 2 రీమేక్లో వెంకీ నటిస్తున్నాడని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ఈ మూవీ రీమేక్ రైట్స్ని సురేష్ బాబు దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..