వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండి..టీచర్లకు కువైట్ సూచన
- February 21, 2021
కువైట్ సిటీ:వ్యాక్సినేషన్ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, ఇతర స్కూల్ సిబ్బందిని ప్రాధాన్యత వర్గంలో చేర్చినట్లు విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి వెల్లడించారు.స్కూల్ టీచర్లు కువైతీలు, ప్రవాసీయులు ఎవరైనా సరే తమ బాధ్యతగా వ్యాక్సిన్ తీసుకోవటం మంచిదని మంత్రిత్వ శాఖ కార్యాలయం అభిప్రాయపడింది.దీనికి సంబంధించి కువైట్ వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునే టీచర్లు, ఇతర స్కూల్ సిబ్బంది వెంటనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది. ఒకవేళ ఇప్పటికే వ్యక్తిగత శ్రద్ధతో వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆయా వివరాలను విద్యా మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో పేర్కొంటూ తమ వివరాలను సవరించాలని కూడా సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







