వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండి..టీచర్లకు కువైట్ సూచన
- February 21, 2021
కువైట్ సిటీ:వ్యాక్సినేషన్ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, ఇతర స్కూల్ సిబ్బందిని ప్రాధాన్యత వర్గంలో చేర్చినట్లు విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి వెల్లడించారు.స్కూల్ టీచర్లు కువైతీలు, ప్రవాసీయులు ఎవరైనా సరే తమ బాధ్యతగా వ్యాక్సిన్ తీసుకోవటం మంచిదని మంత్రిత్వ శాఖ కార్యాలయం అభిప్రాయపడింది.దీనికి సంబంధించి కువైట్ వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునే టీచర్లు, ఇతర స్కూల్ సిబ్బంది వెంటనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది. ఒకవేళ ఇప్పటికే వ్యక్తిగత శ్రద్ధతో వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆయా వివరాలను విద్యా మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో పేర్కొంటూ తమ వివరాలను సవరించాలని కూడా సూచించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







